Stock market for Diwali 2025 దీపావళి 2025 సందర్భంగా, 2025 అక్టోబర్ 21న భారతీయ స్టాక్ మార్కెట్ సాధారణ ట్రేడింగ్ కోసం మూసివేయబడుతుంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE) తో పాటు, కమోడిటీ ఎక్స్ఛేంజీలైన MCX మరియు NCDEX లు కూడా దీపావళి లక్ష్మీ పూజ కారణంగా ఈ రోజు ట్రేడింగ్ సెలవుదినంగా ప్రకటించాయి.
అయితే, దశాబ్దాల నాటి సంప్రదాయాన్ని అనుసరించి, స్టాక్ ఎక్స్ఛేంజీలు దీపావళి రోజున ఒక గంట పాటు ముహూరత్ ట్రేడింగ్ సెషన్ను నిర్వహిస్తాయి. ఈ ప్రత్యేక సెషన్ ఈ రోజు మధ్యాహ్నం 1:45 నుండి 2:45 గంటల వరకు జరుగుతుంది. అక్టోబర్ 21 న సెలవుతో పాటు, అక్టోబర్ 22, 2025న కూడా దీపావళి బలిప్రతిపద కారణంగా స్టాక్ మార్కెట్కు సెలవు ఉంటుంది.
ముఖ్య సమయాలు:
• ప్రీ–ఓపెన్ సెషన్: మధ్యాహ్నం 1:30 నుండి 1:45 గంటల వరకు జరుగుతుంది.
• ముహూరత్ ట్రేడింగ్ సెషన్: మధ్యాహ్నం 1:45 నుండి 2:45 గంటల వరకు.
• ట్రేడ్ మార్పులు: మధ్యాహ్నం 2:55 గంటల వరకు అనుమతించబడతాయి.
ఈ ఒక గంట ట్రేడింగ్ విండో శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది మరియు ఇది సంవత్ 2082 ప్రారంభాన్ని సూచిస్తుంది.
అక్టోబర్, నవంబర్ నెలల్లో ఇతర సెలవులు
అక్టోబర్ 21 న సెలవుతో పాటు, దీపావళి బలిప్రతిపద కారణంగా 2025 అక్టోబర్ 22, బుధవారం కూడా మార్కెట్లకు సెలవు ఉంటుంది. అక్టోబర్ 2025లో మొత్తం మూడు స్టాక్ మార్కెట్ సెలవులు ఉన్నాయి: అక్టోబర్ 2 న మహాత్మా గాంధీ జయంతి/దసరా, అక్టోబర్ 21 న దీపావళి లక్ష్మీ పూజ, మరియు అక్టోబర్ 22 న దీపావళి బలిప్రతిపద.
2025 సంవత్సరంలో మొత్తం 18 ట్రేడింగ్ సెలవులు ఉన్నాయి. అక్టోబరు సెలవుల తరువాత, నవంబర్ 5 న ప్రకాష్ గురుపర్బ్ శ్రీ గురు నానక్ దేవ్ సందర్భంగా, మరియు డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా మార్కెట్లు ఒక్కో రోజు మూసివేయబడతాయి.








